Friday, April 22, 2011

పంజాబ్ కింగ్స్ ఎలెవన్ భారీ విజయం

షాన్ మార్ష్ మెరుపు అర్ధసెంచరీ
మొహాలీ,ఏప్రిల్ 22: షాన్ మార్ష్ మెరుపు అర్ధసెంచరీకి తోడుగా జట్టు మొత్తం ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరచడంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మరో భారీ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో గెలిచి సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. పీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. షాన్ మార్ష్ (42 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి అర్ధసెంచరీ సాధించాడు. దినేశ్ కార్తీక్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించాడు. . రాజస్థాన్ బౌలర్ టెయిట్ మూడు వికెట్లు తీసుకోగా, వాట్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తరువాత రాజస్థాన్  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు (20 బంతుల్లో) చేసిన జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలవగా, రాజస్థాన్‌కు ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో ఓటమి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...