పుట్టపర్తి ,ఏప్రిల్ 26: సత్యబాబాకు ‘సత్యగీత’ అత్యంత ప్రీతిపాత్రమైన ఏనుగు. సత్యసాయి నిర్యాణం భక్తులను ఎంత వేదనకు గురిచేసిందో, సంఘటనను జీర్ణించుకోవడం సత్యగీతకూ అంతే కష్టంగా ఉంది. గతంలో సత్యసాయికి పెంపుడు ఏనుగుగా ఉన్న సాయిగీత మూడేళ్ల క్రితం ప్రమాదవ శాత్తూ మరణించిన తరువాత, సత్యగీత ఆయన కొలువులో చేరింది. అయితే సత్యగీతకన్నా సాయిగీతకే సాయిబాబాతో అనుబంధం ఎక్కువ. సత్యగీత వచ్చే సరికే బాబా కొంత అనారోగ్యంతో ఉండటంతో సత్యగీత, సాయిబాబా కలయిక తరచూ జరిగేది కాదని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రశాంతి నిలయంలో ఏ కార్యక్రమం జరిగినా సత్యగీత ముందుండేది. ఇప్పుడు సాయిబాబా నిర్యాణం తరువాత అంతా సాయిబాబా అంత్యక్రియల ఏర్పాట్లులో ఉన్నారే తప్ప, బాబాకు ప్రీతిపాత్రమైన సత్యగీతను అంతగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం తన ఆవాసంలోనే సత్యగీత దీనంగా కనిపిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment