Saturday, April 23, 2011

ఈజిప్టుకు భారత్ ఈవీఎంలు

కైరో,ఏప్రిల్ 23:  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) అద్భుతమైన యంత్రాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషీ అభివర్ణించారు. భారత్‌లో అమలవుతున్న ఎన్నికల వ్యవస్థ గురించి ఈజిప్టు ఉన్నతాధికారులకు వివరించేందుకోసం ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆయన కైరో వచ్చారు. ముబారక్ నియంతృత్వ శకం ముగిసినందున ఈజిప్టులో ఎన్నికల వ్యవస్థకు బాసటగా నిలిచేందుకు ఈవీఎంలను సమకూరుస్తామని ఆయన తెలిపారు. అయితే ఈజిప్టులో జరిగే ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణలో మాత్రం తాము పాల్గొనబోమని స్పష్టంచేశారు. శుక్రవారం ఈజిప్టు న్యాయశాఖ మంత్రితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉన్నందున భారత్ తమ ఈవీఎంలను అరువు ప్రాతిపదికన ఈజిప్టుకు సమకూరుస్తుందని ఖురేషీ వెల్లడించారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...