కోల్కతా,ఏప్రిల్ 22: ఐపీఎల్-4 టోర్నిలో అడుగుపెడుతూనే క్రిస్ గేల్ సెంచరీ నమోదు చేశాడు. కోల్కతా నైట్రైడర్స్ విసిరిన 172 పరుగుల విజయలక్ష్యాన్ని 11 బంతులుండగానే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అవలీలగా అధిగమించారు. బెంగళూరు ఒపెనర్లు గేల్, దిల్షాన్లు ధాటిగా బ్యాటింగ్ను ప్రారంభించి తొలి వికెట్కు 123 పరుగులు జోడించారు. ఆతర్వాత బ్యాటింగ్ దిగిన విరాట్ కోహ్లీ కూడా వేగంగా పరుగుల్ని సాధించాడు. గేల్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 102 పరుగులు చేయగా, దిల్షాన్ 38, కోహ్లీ 30 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
అంతకుముందు బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. నైట్రైడర్స్ జట్టులో అత్యధికంగా కెప్టెన్ గంభీర్ 48, యూసఫ్ పఠాన్ 46, కల్లీస్ 40, హాడిన్ 18 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో అరవింద్ 2, మహ్మద్, వెట్టోరిలకు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. నైట్రైడర్స్ జట్టులో అత్యధికంగా కెప్టెన్ గంభీర్ 48, యూసఫ్ పఠాన్ 46, కల్లీస్ 40, హాడిన్ 18 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో అరవింద్ 2, మహ్మద్, వెట్టోరిలకు చెరో వికెట్ దక్కింది.
No comments:
Post a Comment