డెక్కన్ చార్జర్స్ పరాజయం
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ ఎనిమిదో సారి పరాజయం పాలైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో డెక్కన్ చార్జర్స్ ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన డెక్కన్ చార్జర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
Comments