సాయి బాబా కు మలేసియా భక్తుల సంతాపం

కౌలాలంపూర్ ,ఏప్రిల్ 26: భగవాన్ సత్యసాయి బాబా మరణం పట్ల మలేసియాలోని భక్తులు సంతాపం వ్యక్తం చేశారు.  మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని బాంగ్‌సార్ ప్రాంతంలో 200 మందిపైగా బాబా భక్తులు ఒకచోట చేరి అవతార పురుషుడికి శోకతప్త హృదయాలతో అంజలి ఘటించారు. భజనలతో భక్తజన బాంధవుడికి నివాళి అర్పించారు. సాయి మహిమలను ఈ సందర్భంగా  తలుచుకున్నారు. ‘‘బాబా మాకు గురువు కంటే ఎక్కువ. భక్తులందరికీ ఆయన తండ్రి వంటి వారు’’ అని మలేసియాలోని సత్యసాయి సెంట్రల్ కౌన్సిల్ అధ్యక్షుడు సురేష్ గోవింద్ అన్నారు.  పలువురు చైనా భక్తులు కూడా బాబాకు అంజలి అర్పించారు. పెనాంగ్ రాష్ట్రం నుంచి పలువురు పుట్టపర్తి వెళ్లనున్నట్టు చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు