కౌలాలంపూర్ ,ఏప్రిల్ 26: భగవాన్ సత్యసాయి బాబా మరణం పట్ల మలేసియాలోని భక్తులు సంతాపం వ్యక్తం చేశారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్లోని బాంగ్సార్ ప్రాంతంలో 200 మందిపైగా బాబా భక్తులు ఒకచోట చేరి అవతార పురుషుడికి శోకతప్త హృదయాలతో అంజలి ఘటించారు. భజనలతో భక్తజన బాంధవుడికి నివాళి అర్పించారు. సాయి మహిమలను ఈ సందర్భంగా తలుచుకున్నారు. ‘‘బాబా మాకు గురువు కంటే ఎక్కువ. భక్తులందరికీ ఆయన తండ్రి వంటి వారు’’ అని మలేసియాలోని సత్యసాయి సెంట్రల్ కౌన్సిల్ అధ్యక్షుడు సురేష్ గోవింద్ అన్నారు. పలువురు చైనా భక్తులు కూడా బాబాకు అంజలి అర్పించారు. పెనాంగ్ రాష్ట్రం నుంచి పలువురు పుట్టపర్తి వెళ్లనున్నట్టు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment