ముంబయి,ఏప్రిల్ 11: ఐపీఎల్-4లో కొత్తగా ప్రవేశించిన పూణె వారియర్స్ శుభారంభం చేసింది. ఆదివారమిక్కడ జరిగిన 5వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 13.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. వారియర్స్ బ్యాట్స్మెన్లలో జెస్సీ రైడర్ 17 బంతుల్లోనే ఆరు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. కాగా, మన్హాస్ 35, రాబిన్ ఉతప్ప 22, యువరాజ్సింగ్ 21 పరుగులు చేసి విజయానికి తోడ్పాటు అందించారు. కింగ్స్ బౌలర్లలో ప్రవీణ్కుమార్, మెక్లారెన్, నాయర్ తలో వికెట్ తీసుకున్నారు.
ఓడిన ఢిల్లీ డేర్డెవిల్స్
ఫిరోజ్షా కోట్ల మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ పై ముంబై ఇండియన్స్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్డెవిల్స్ 17.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. సులభమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ సచిన్ (50 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫామ్ను కొనసాగిస్తూ చివరి వరకూ నిలబడి జట్టును గెలిపించాడు. సంచలన బౌలింగ్ ప్రదర్శనకు గాను మలింగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఓడిన ఢిల్లీ డేర్డెవిల్స్
ఫిరోజ్షా కోట్ల మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ పై ముంబై ఇండియన్స్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ డేర్డెవిల్స్ 17.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. సులభమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ సచిన్ (50 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫామ్ను కొనసాగిస్తూ చివరి వరకూ నిలబడి జట్టును గెలిపించాడు. సంచలన బౌలింగ్ ప్రదర్శనకు గాను మలింగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
No comments:
Post a Comment