Wednesday, April 27, 2011

మహా సమాధి లోకి సత్యసాయిబాబా

పుట్టపర్తి,  ఏప్రిల్ 27:    సత్యసాయి మహా సమాధి అయ్యారు. సాయి కుల్వంత్ హాల్‌లో బుధవారం బాబా అంత్యక్రియలు శాస్త్రోక్తంగా పూర్తి అయ్యాయి. మరణ కాల దోష పరిహారం కోసం బాబా సోదరుని కుమారుడు రత్నాకర్‌తో వేద పండితులు దశదానాలు చేయించారు. పీఠాధిపతులు వేదమంత్రోచ్చారణతో బాబాకు హారతి ఇచ్చారు. బాబా అంతిమ కోర్కె ప్రకారం వేద పండితులు క్రతువు నిర్వహించారు. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో బాబా పార్దీవ దేహానికి అభిషేకం చేశారు. అనంతరం పంచద్రవ్యాలతో సంప్రోక్షణ చేసి, ఉపనిషత్తుల ప్రకారం వేద పండితులు పూజలు నిర్వహించారు. సాయికి మహాహారతితో మహాసమాధి పూర్తి అయ్యింది. ఈ అంత్యక్రియల కార్యక్రమం సుమారు 90 నిమిషాల పాటు కొనసాగింది. పుట్టపర్తిలో ఏర్పాటు చేసి భారీ స్క్రీన్‌ల ద్వారా సత్యసాయి అంతిమ సంస్కార కార్యక్రమాలను భక్తులు వీక్షించారు. మహా సమాధి కార్యక్రమానికి బాబా కుటుంబసభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు ఎల్‌కె అద్వానీ, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మర్రి శశిథర్‌రెడ్డి, డీజీపీ అరవిందరావు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్, వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, పలు రాష్ట్ర మంత్రులు, వీఐపీలు హాజరు అయ్యారు.
ఏప్రిల్ 4తేదినే బాబా శవపేటికకు ఆర్డర్...!
సత్యసాయి మరణంపై వున్న పలు అనుమానాలకు బలం చేకూరుతున్నాయి. బాబా కోసం శవపేటికను ఏప్రిల్ 4 తేదిన ఆర్దర్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  ట్రస్ట్ సభ్యులు కోరిన విధంగానే ఏప్రిల్ 5 తేదిన శవపేటిక కోయంబత్తూరు నుంచి కుమార్ అండ్ కో నుంచి పుట్టపర్తికి పంపినట్టు రశీదులో వివరాలు వెల్లడయ్యాని ఒక న్యూస్ చానెల్ తెలిపింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...