Friday, April 22, 2011

సత్యసాయిబాబా సజీవ సమాధికి సన్నాహాలు...?

పుట్టపర్తి,ఏప్రిల్ 22:  పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రభుత్వం, ట్రస్టు చేస్తున్న ఏర్పాట్లను చూస్తుంటే  బాబా సజీవ సమాధికి సన్నాహాలు  జరుగుతున్నట్టు  కనిపిస్తోందని పలువురు భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీవించి ఉండగానే చైతన్యం పొందిన ఆత్మలు సమాధిలోకి వెళ్లిపోవడాన్ని సజీవ సమాధిగా చెపుతుంటారు. గురువారం ట్రస్టు సభ్యులు అత్యవసరంగా భేటీ కావడం దీనికి మరింత ఊపునిస్తోంది. ఇప్పటికే ధర్మవరంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి మూడు హైపవర్ జనరేటర్లు తరలించారు. కడప, వరంగల్ జిల్లాలకు చెందిన ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు కర్నూలులో సిద్ధంగా ఉంచారు. కర్నూలుకు చెందిన ఏపీఎస్పీ బెటాలియన్‌ను ఇప్పటికే పుట్టపర్తికి తరలి వెళ్లింది. ఇక్కడ ఏర్పాట్లను ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నారు. వీవీఐపీలు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హుటాహుటిన హెలిప్యాడ్‌లను నిర్మిస్తున్నారు. పలువురు డీఐజీలు అక్కడే మకాం వేశారు. కర్ణాటక అధికారుల బృందం కూడా పుట్టపర్తి బయలు దేరింది. సత్యసాయిని చూసేందుకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో పలువురు కేంద్ర మంత్రులు వస్తున్నట్టు వార్తలు  పొక్కుతున్నాయి. మరోవైపు ఆస్పత్రి వైద్యులు మాత్రం పాత పాటే పాడుతున్నారు. బాబా ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు.   సత్యసాయి గత నెల 28వ తేదీ నుంచి ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి భక్తులకు బాబా దర్శనం కరువైంది. ఇలావుండగా, చిక్‌బళ్లాపూర్ స్వామిజీ శివసాయిబాబా పుట్టపర్తికి చేరుకుని   ఆస్పత్రిలోకి వెళ్లాలని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసుల విజ్ఞప్తిని ఖాతరు చేయని శివసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...