Sunday, April 24, 2011

డెక్కన్ ఛార్జర్స్ ఓటమి

హైదరాబాద్,ఏప్రిల్ 24: ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మలింగ ధాటికి తట్టుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. డెక్కన్ జట్టులో అత్యధికంగా కుమార సంగక్కర 34, ధావన్ 25, మిశ్రా 25, క్రిస్టియన్ 21 పరుగులు చేశారు. మిగితా డెక్కన్ ఆటగాళ్లు రెండెంకెల స్కోరును చేరుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో మలింగ 3 వికెట్లు పడగొట్టగా, పటేల్, పొలార్ద్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి డెక్కన్ ఛార్జర్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓ దశలో 70 పరుగులకే ముంబై నాలుగు వికెట్లు కోల్పోయింది. 70 పరుగుల వద్ద సచిన్, రాయుడు, పొలార్డ్  అవుటవ్వడంతో ముంబై కష్టాల్లో పడింది. డ్డట్టు కనిపించింది. అయితే రోహిత్ శర్మ, సైమండ్స్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో ముంబై భారీ లక్ష్యాన్ని డెక్కన్ ముందుంచింది. రోహిత్ 56 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సైమండ్స్ 44 (33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సరు) పరుగులు చేశారు. వీరిద్దరూ 5 వికెట్‌కు 102 పరుగులు జోడించారు. మిశ్రాకు రెండు వికెట్లు, ఓజా, ఇషాంత్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...