హైదరాబాద్,ఏప్రిల్ 30 : మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పై శనివారం బార్కాస్ వద్ద దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట వద్ద ఆయనతో పాటు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై కూడా దాడి జరిగింది. పాదయాత్ర చేస్తుండగా ఉదయం 11.15 నిమిషాలకు ఒవైసీపై నాలుగు రౌండ్లు కాల్పులతో పాటు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అక్బరుద్దీన్ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. ఒవైసీ శరీరం నుంచి మూడు బుల్లెట్లను వైద్యులు బయటకు తీశారు. ఆయనకు ప్రాణ హాని లేదని వైద్యులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.మహ్మద్ పహిల్వాన్ అనే వ్యక్తి ఈ కాల్పులు చేయించినట్లు సమాచారం. స్మశాన వాటిక స్థల విషయంలో ఒవైసీకి, మహ్మద్ పహిల్వాన్కు మధ్య వివాదం వుంది. ఒవైసీని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, హొం మంత్రి సబిత పరామర్శించారు. ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రిని హత్తుకొని ఎమ్మెల్యే బలాల్ కంటతడిపెట్టారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు పాతబస్తీలో హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ఒవైసీ ఆస్పత్రి సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఆస్పత్రి సమీపంలో భారీగా పోలీసులు మోహరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment