పైలట్ల సమ్మెతో ఎయిరిండియా టికెట్ బుకింగ్ నిలిపివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : పైలట్ల సమ్మెతో ఎయిరిండియా శుక్రవారం నుంచి అయిదు రోజుల వరకూ టికెట్ బుకింగ్ను నిలిపివేసింది. కాగా పైలట్లు చేపట్టిన సమ్మె నేటితో రెండోరోజుకు చేరింది. దాంతో 50 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. పైలట్ల సమ్మెపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు పైలట్లతో పాటు ఎగ్జిక్యూటివ్ పైలట్లు కూడా సమ్మెకు దిగారు. కాగా ఎయిరిండియా పైలట్ల సమ్మెతో వందలమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ ఇండియాలోని ఓ వర్గానికి చెందిన భారత వాణిజ్య పైలట్ల సంఘం(ఐసీపీఏ) పైలట్లు.. తమకు సహోద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన వీరంతా.. సంస్థ విలీనం అనంతరం ఎయిర్ ఇండియాలో పైలట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బందితో సమానంగా వేతనాలు, మెరుగైన పని వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐసీపీఏకి చెందిన దాదాపు 600 మంది పైలట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి హఠాత్తుగా సమ్మెకు ఉపక్రమించారు.
Comments