న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : పైలట్ల సమ్మెతో ఎయిరిండియా శుక్రవారం నుంచి అయిదు రోజుల వరకూ టికెట్ బుకింగ్ను నిలిపివేసింది. కాగా పైలట్లు చేపట్టిన సమ్మె నేటితో రెండోరోజుకు చేరింది. దాంతో 50 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. పైలట్ల సమ్మెపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు పైలట్లతో పాటు ఎగ్జిక్యూటివ్ పైలట్లు కూడా సమ్మెకు దిగారు. కాగా ఎయిరిండియా పైలట్ల సమ్మెతో వందలమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ ఇండియాలోని ఓ వర్గానికి చెందిన భారత వాణిజ్య పైలట్ల సంఘం(ఐసీపీఏ) పైలట్లు.. తమకు సహోద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన వీరంతా.. సంస్థ విలీనం అనంతరం ఎయిర్ ఇండియాలో పైలట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బందితో సమానంగా వేతనాలు, మెరుగైన పని వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐసీపీఏకి చెందిన దాదాపు 600 మంది పైలట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి హఠాత్తుగా సమ్మెకు ఉపక్రమించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment