Sunday, April 10, 2011

జగన్‌ ఓటమి లక్ష్యంగా కడపకు క్యాబినెట్...!

హైదరాబాద్,ఏప్రిల్ 11: కడపలో జగన్‌ను ఓడించడంపై ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్  పూర్తిగా దృష్టి పెట్టారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలపై  డీఎస్ సమక్షంలో  సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. జగన్‌ను నిలువరించేందుకు సర్వ శక్తులూ ఒడ్డాలని మంత్రులను సీఎం కిరణ్ ఆదేశించారు.  నామినేషన్ల ఘట్టం నుంచి ఓట్ల లెక్కింపు దాకా ఎవరెవరు ఏమేం చేయాలో పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పులివెందుల అభ్యర్థి, వ్యవసాయ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, టీజీ వెంకటేశ్, కె.పార్థసారథి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బసవరాజ్ సారయ్య, పసుపులేటి బాలరాజు, డీకే అరుణ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు భేటీలో పాల్గొన్నారు. కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యతలను ఏడుగురు సీనియర్ మంత్రులకు సీఎం ప్రత్యేకంగా అప్పగించారు. కడపకు కన్నా లక్ష్మీనారాయణ, పులివెందులకు ఆనం రామనారాయణరెడ్డి, ప్రొద్దుటూరుకు టీజీ వెంకటేశ్, జమ్మలమడుగుకు బొత్స సత్యనారాయణ, బద్వేలుకు మానుగుంట మహీధర్‌రెడ్డి, కమలాపురానికి ఎన్.రఘువీరారెడ్డి, మైదుకూరుకు ధర్మాన ప్రసాదరావు ఇన్‌చార్జిలుగా నియమితులయ్యారు. నామినేషన్ల అనంతరం పోలింగ్ ప్రక్రియ దాకా ఏడుగురు మంత్రులూ పూర్తిస్థాయిలో నియోజకవర్గాల్లోనే ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఈ మంత్రులకు ఎంపీలంతా పూర్తిస్థాయిలో చేదోడువాదోడుగా నిలవాలని నిర్ణయించారు. వీరికి తోడు రాష్టవ్య్రాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కూడా కడప లోక్‌సభ స్థానం పరిధిలోని మండలాలకు భారీగా తరలించనున్నారు. మండలాల వారీగా వారిని రప్పించుకునే బాధ్యతను ఆయా నియోజకరవర్గాల మంత్రులకు అప్పగించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...