పూణే వారియర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ముంబై: ఐపీఎల్ టోర్నిలో భాగంగా పూణే వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ఇంకా మూడు బంతులు ఉండగానే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో ర్యాంక్‌ల పట్టికలో చెన్నై జట్టు రెండవస్థానానికి చేరుకుంది. చెన్నై జట్టులో అత్యధికంగా బద్రినాథ్ 63 పరుగులు చేశారు. బద్రీనాథ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశారు. రైనా 25 బంతుల్లో 34 పరుగులు, విజయ్ 31 పరుగుల సాధించి చెన్నై జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు