Tuesday, April 26, 2011

పుణే వారియర్స్ కు మరో ఓటమి

చెన్నై,ఏప్రిల్ 26: ఐపీఎల్-4లో చెన్నైతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పుణే వారియర్స్ 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వారియర్స్ లక్ష్య ఛేదనలో ఏమాత్రం చురుకుదనం కనబరచలేదు . రైడర్ (15), మిశ్రా (9), పాండే (12)లు త్వరగా పెవిలియన్ చేరి అభిమానులను నిరాశ పరిచారు.  యువరాజ్ ఒక్కడే పోరాడి 34 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. చెన్నై టీం సమష్టిగా రాణించి విజయ బాపుటా ఎగురవేసింది. చెన్నై బౌలర్లలో మోర్కెల్ మూడు, అశ్విన్ , బొలింగర్ లు తలో రెండు వికెట్లు తీశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...