ట్రాక్టర్ బోల్తా : పదిమంది మహిళలు దుర్మరణం

గుంటూరు,ఏప్రిల్ 25:  : గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ నాగార్జున సాగర్ కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది మహిళలు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద చిక్కుకున్నవారిని స్థానికులు బయటకు తీస్తున్నారు. బాధితులు సత్తెనపల్లి సమీపంలో సుందరయ్య కాలనీ వాసులు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు