Monday, April 25, 2011

ట్రాక్టర్ బోల్తా : పదిమంది మహిళలు దుర్మరణం

గుంటూరు,ఏప్రిల్ 25:  : గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ నాగార్జున సాగర్ కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది మహిళలు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద చిక్కుకున్నవారిని స్థానికులు బయటకు తీస్తున్నారు. బాధితులు సత్తెనపల్లి సమీపంలో సుందరయ్య కాలనీ వాసులు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...