ట్రాక్టర్ బోల్తా : పదిమంది మహిళలు దుర్మరణం
గుంటూరు,ఏప్రిల్ 25: : గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ నాగార్జున సాగర్ కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది మహిళలు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద చిక్కుకున్నవారిని స్థానికులు బయటకు తీస్తున్నారు. బాధితులు సత్తెనపల్లి సమీపంలో సుందరయ్య కాలనీ వాసులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments