Friday, April 22, 2011

టెస్ట్ లకు మలింగ గుడ్‌బై

ముంబై,ఏప్రిల్ 22: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ టెస్ట్ లకు  గుడ్‌బై చెప్పాడు.  ఐపీఎల్ టోర్నిలో ముంబై ఇండియన్స్ కు  ఆడుతున్న మలింగను ఇంగ్లాండ్ లో జరిగే పర్యటనకు శ్రీలంక సెలక్షన్ కమిటీ జట్టునుంచి తప్పించారు. మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు అందుబాటులో వుండనని తెలిపిన మలింగ ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఐపీఎల్ టోర్నిలో ఆడుతున్నాడు. అయితే మలింగ వ్యవహారంపై శ్రీలంక క్రికెట్ బోర్డు మండిపడింది. టెస్ట్ లకు అందుబాటులో వుండకపోవడంపై స్పందిస్తూ.. తాను వన్డే, టీ20 పోటీలకు ఫిట్‌గా వున్నానని.. ఎక్కువ సేపు ఫీల్డ్ లో  వుండే ఫిట్‌నెస్ తనకు లేకపోవడం వల్ల టెస్ట్ లకు ఆడనని తెలిపానని మలింగ వెల్లడించాడు. ఇప్పటి వరకు మలింగ 30 టెస్ట్ లలో  101 వికెట్లు, 84 వన్డేలో 127 వికెట్లు, 29 టీ20 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు తీసుకున్నాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...