Saturday, April 9, 2011

మరో ప్రవాస భారతీయుడికి ఒబామా కొలువు

వాషింగ్టన్,ఏప్రిల్ 9: : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరో ప్రవాస భారతీయుడికి తమ కొలువులో ఉన్నత  పదవి కేటాయించారు. విస్కాన్సిన్ లా స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అంజు దేశాయ్‌ని ప్రభుత్వంలోని విదేశీ దావా పరిష్కార బృందం (ఫారిన్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ కమిటీ) లో సభ్యునిగా నియమించారు.  అంజుదేశాయ్ 2001లో విస్కాన్సిస్ యూనివర్సిటీలో చేరడానికి ముందు చైనా నాన్జింగ్‌లోని జాన్ హాప్కిన్స్ వర్సిటీ, తైవాన్‌లోని నేషనల్ సింగ్ హువా యూనివర్సిటీలో, తైవాన్‌లోని నేషనల్ తైవాన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. అంతకుముందు ఇరాన్-యుఎస్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో పనిచేసిన అనుభవం ఉంది. హార్వర్డ్‌తో సహా అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేసిన దేశాయ్ కాలిఫోర్నియా లా రివ్యూ’కి చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మరికొన్ని సంస్థల్లోనూ కీలక పదవులు నిర్వహిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...