Saturday, April 16, 2011

విజయమ్మ , వివేకానందరెడ్డి నామినేషన్లు

పులివెందుల,ఏప్రిల్ 16 : పులివెందుల  అసెంబ్లీ స్థానానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ విజయమ్మ,  కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డి సహా 9మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి నామినేషన్ వేశారు. కాగా విజయలక్ష్మి పేరుతో జేఈ విజయలక్ష్మి, ఈ విజయలక్ష్మీ, ఓ విజయలక్ష్మీ ఇంటి పేర్లతో  మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్‌ఆర్ సతీమణి విజయమ్మ తాసీల్దార్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషను పత్రాలను ఆర్డీవోకు అందచేశారు. విజయమ్మతో పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఇంటి వద్ద నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరిన వీరితో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చారు.
కడప లో డీఎల్ నామినేషన్
 కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదుల్లా, కేంద్రమంత్రి సాయిప్రతాప్ తదితరులు హాజరయ్యారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...