న్యూఢిల్లీ,ఏప్రిల్ 14: దక్షిణాదిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. తమిళనాడులో 75 శాతం మంది ఓటర్లు, కేరళలో 74.4 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా.. అత్యధికంగా పుదుచ్చేరిలో 85.21 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో.. ప్రత్యేకించి తమిళనాడులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి ప్రయత్నంగా భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారులు గట్టి నిఘా పెట్టారు. తనిఖీల్లో తమిళనాడులో రూ. 54.17 కోట్లు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. మూడు అసెంబ్లీ ఎన్నికలనూ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. కేరళలో మొట్టమొదటి సారిగా 8,835 మంది ప్రవాస భారతీయులు ఓటేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి (86), కేరళ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ (87), పుదుచ్చేరి సీఎం వైద్యలింగం, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత (63) వంటి హేమాహేమీల భవితవ్యం మే 13వ తేదీన జరిగే కౌంటింగ్లో తేలనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాం (ఆంధ్రప్రదేశ్లో ఉంది) అసెంబ్లీ నియోజకవర్గంలో 95.64 శాతం పోలింగ్ నమోదైంది. 30,936 మంది ఓటర్లకుగాను అత్యధికంగా 29,585 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment