Tuesday, April 12, 2011

కళ్యాణ వైభోగమే...

' వార్తాప్రపంచం '  వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.. 
భద్రాచలం,ఏప్రిల్ 12 : భూలోక వైకుంఠమైన భద్ర గిరిలో మంగళవారం శ్రీ సీతారామచంద్రస్వాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా స్టేడియంలో సరిగ్గా మధ్యాహ్నం 12.గంటలకు ఆగమ శాస్త్ర ప్రకారం అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. ఆతర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు. అనంతరం సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది.  ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను  సమర్పించారు.కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, రెండు గంటలకు తిరువారాధన, నాలుగు గంటలకు అభిషేకరం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలోని ధ్రువ మూర్తుల కళ్యాణం, తొమ్మిది గంటలకు అలంకారం చేశారు. తొమ్మిదిన్నర గంటలకు మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తెచ్చారు. సరిగ్గా పన్నెండు  గంటలకు కళ్యాణం జరిగింది. ఈ వేడుకను కన్నులారా తిలకించి తరించేందుకు దేశనలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో భద్రాచలం పట్టణంలోని వీధులన్నీ జనసంద్రమయ్యాయి.12 సంవత్సరాలకో మారు జరిగే పుష్కర పట్టాభిషేకాన్ని కూడా తిలకించాలనే తలంపుతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.                                       

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...