వారెవా...! వా..ట్సన్...!
మిర్పూర్,ఏప్రిల్ 11: బంగ్లాదేశ్తో శనివారమిక్కడ జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించాడు. వామ్మో! వాట్సన్ అనుకునేలా విజృంభించాడు. 15 సార్లు బంతిని బౌండరీ కి తరలించిన ఈ డాషింగ్ ఓపెనర్ అంతే సంఖ్యలో బాల్ను బౌండరీ అవతలకు కొట్టాడు. బంగ్లా నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 26 ఓవర్లలోనే ఛేదించింది. ఆస్ట్రేలియా 26 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 232 పరుగులు చేసింది.96 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 185 పరుగులు చేసిన వాట్సన్ అజేయంగా నిలిచాడు. అతడికి రికీ పాంటింగ్(37) అండగా నిలిచాడు. హాడిన్ 8 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ విజయంతో మూడు వన్డేల ఈ సిరీస్ను ఆసీస్ 2-0 తో కైవ్సం చేసుకుంది. మూడో వన్డే ఈ నెల 13న జరగనుంది.

Comments