మిర్పూర్,ఏప్రిల్ 11: బంగ్లాదేశ్తో శనివారమిక్కడ జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించాడు. వామ్మో! వాట్సన్ అనుకునేలా విజృంభించాడు. 15 సార్లు బంతిని బౌండరీ కి తరలించిన ఈ డాషింగ్ ఓపెనర్ అంతే సంఖ్యలో బాల్ను బౌండరీ అవతలకు కొట్టాడు. బంగ్లా నిర్దేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 26 ఓవర్లలోనే ఛేదించింది. ఆస్ట్రేలియా 26 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 232 పరుగులు చేసింది.96 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 185 పరుగులు చేసిన వాట్సన్ అజేయంగా నిలిచాడు. అతడికి రికీ పాంటింగ్(37) అండగా నిలిచాడు. హాడిన్ 8 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ విజయంతో మూడు వన్డేల ఈ సిరీస్ను ఆసీస్ 2-0 తో కైవ్సం చేసుకుంది. మూడో వన్డే ఈ నెల 13న జరగనుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment