ఫస్ట్ ఇంటర్ లో 52.21 ఉత్తీర్ణత
హైదరాబాద్,ఏప్రిల్ 21: ఇంటర్మీడియెట్ ప్రధమ సంవత్సర ఫలితాలు విడుదల అయ్యాయి.52.21 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత మూడు శాతం పెరిగింది. బాలికల ఉత్తీర్ణత శాతం 56.61 శాతం కాగా, బాలురు 48.46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలోను,నల్గొండ జిల్లా చివరి స్థానంలోనూ నిలిచాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 27 నుంచి జరుగుతాయి.
Comments