Thursday, April 21, 2011

ఫస్ట్ ఇంటర్ లో 52.21 ఉత్తీర్ణత

హైదరాబాద్,ఏప్రిల్ 21: ఇంటర్మీడియెట్ ప్రధమ సంవత్సర ఫలితాలు విడుదల అయ్యాయి.52.21 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత మూడు శాతం పెరిగింది. బాలికల ఉత్తీర్ణత శాతం 56.61 శాతం కాగా, బాలురు 48.46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలోను,నల్గొండ జిల్లా చివరి స్థానంలోనూ నిలిచాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 27 నుంచి జరుగుతాయి.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...