Monday, April 18, 2011

ఉత్తర కరోలినా లో తుపాన్ ధాటికి 23 మంది మృతి

వాషింగ్టన్, ఏప్రిల్ 18: అమెరికాపై తుపాన్లు విరుచుకుపడ్డాయి. వీటి ధాటికి ఆరు రాష్ట్రాల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు కూడా కూలిపోయాయి. అత్యవసర సహాయ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.  ఉత్తర కరోలినా లో అధిక నష్టం సంభవించింది.  దీంతో ఉత్తర కరోలినా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఉత్తర కరోలినాలో 23 మంది, వర్జీనియాలో నలుగురు, అలమాబాలో ఏడుగురు మృతిచెందారు. మరోవైపు వర్జీనియాలో వచ్చిన తుపాను తీవ్రతకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...