బెంగళూరు, ఏప్రిల్ 28 : పుట్టపర్తి సత్య సాయిబాబా కర్ణాటకలోని మాండ్యా జిల్లా దొడ్డమలూర్ గ్రామంలో ప్రేమ సాయిగా అవతరిస్తారని నమ్ముతున్నారు. ఈ చిన్న గ్రామం బెంగళూర్ - మైసూర్ రహదారి పక్కన ఉంది. పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు ఒకరు శ్రీ సత్య సాయి - ఆనందసాయి అనే శీర్షికతో రాసిన పుస్తకంలో ప్రేమ సాయి అవతారం ఇక్కడే జరుగుతుందని చెప్పాడని గ్రామస్థులు విశ్వసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కలియుగంలో తాను మూడు అవతారాలు ఎత్తుతానని, తాను షిర్డీ సాయి బాబా అవతారాన్ని అని, మూడో అవతారం ప్రేమసాయిగా దొడ్డమలూర్ గ్రామంలో జరుగుతుందని ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు సత్యసాయి బాబా తనకు చెప్పినట్లు ఆ భక్తుడు రాశాడు. తాను చిన్న ఇంటిలో జన్మిస్తానని 1960 దశకంలో గ్రామాన్ని సందర్శించినప్పుడు బాబా చెప్పారని తెలిపాడు. కాగా, సత్య సాయిబాబా అంచనా ప్రకారం ప్రేమ సాయి ఈ గ్రామంలో 2023లో పుడతాడని కృష్ణా చారిటబుల్ ట్రస్టు నడుపుతున్న రామదాసు అనే వ్యక్తి చెప్పినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. తన వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ కస్తూరి స్త్రీగా జన్మిస్తాడని, అదే గ్రామానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుని ప్రేమసాయికి జన్మ ఇస్తుందని సత్య సాయి చెప్పినట్లు ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment