హెలికాఫ్టర్ ప్రమాదంలో 17 మంది మృతి

గౌహతి,ఏప్రిల్ 19: అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో 17 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా వున్నారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లతోసహా ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పవన్ హాన్స్ హెలికాఫ్టర్ లిమిటెడ్‌కు చెందినది. ల్యాడింగ్ సమయంలో మంటలంటు కోవడంతో హెలికాఫ్టర్‌కు ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు