Tuesday, April 19, 2011

హెలికాఫ్టర్ ప్రమాదంలో 17 మంది మృతి

గౌహతి,ఏప్రిల్ 19: అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో 17 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా వున్నారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లతోసహా ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పవన్ హాన్స్ హెలికాఫ్టర్ లిమిటెడ్‌కు చెందినది. ల్యాడింగ్ సమయంలో మంటలంటు కోవడంతో హెలికాఫ్టర్‌కు ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...