పుట్టపర్తి, ఏప్రిల్ 28 : సత్యసాయి ట్రస్టు ఏడాది వ్యయం రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య వుంటున్నదని ట్రస్టీలలో ఒకరైన శ్రీనివాస్ మీడియాకు వివరించారు. అలాగే సత్యసాయి మెడికల్ ట్రస్టుకి ఏటా రూ.100 నుంచి రూ.130 కోట్ల వరకూ విరాళాలు అందుతున్నాయని చెప్పారు. ట్రస్టుకి విరాళాలు కావాలని సత్యసాయి బాబా ఏనాడు భక్తులను కానీ, మరెవ్వరిని కానీ కోరలేదని తెలిపారు. సత్యసాయి బాబా పేరుమీద ఆస్తులేవీ లేవని, ఆస్తులన్నీ ట్రస్టు పేరుమీదనే ఉన్నాయనీ, పూర్తిగా ట్రస్టు నియంత్రణలోనే కార్యకలాపాలు కొనసాగాయనీ శ్రీనివాసన్ వెల్లడించారు. ట్రస్టుకి తదుపరి చైర్మన్ ఎవరనేదీ త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ట్రస్టు సభ్యులలోనే ఒకరిని ఎన్నుకుంటామని, ట్రస్టు వ్యవహారాలతో సంబంధం లేని బయటివారికి చెక్పవర్ అప్పగించబోమని చెప్పారు. సత్యసాయి బాబా ఆసుపత్రిలో చేరిన మొదటిరోజే శవపేటిక తయారీకి ఆర్డర్ ఇచ్చారన్న ఆరోపణలను సెంట్రల్ ట్రస్ట్ ఖండించింది. ఈ ఆరోపణలు అవాస్తవమని, ఒక భక్తుడు ఈ ఆర్డర్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని మీడియా సమావేశంలో ట్రస్టీ శ్రీనివాసన్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే నిరాధార కథనాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా, ప్రత్యేకించి సత్యసాయి ట్రస్ట్ ఆస్తులను మదించి విలువ లెక్కకట్టలేదని గత ఏడాది వరకూ ట్రస్ట్ కార్యకలాపాలు, ఆస్తులకు సంబంధించి ఆడిట్ వివరాలు మాత్రం ప్రభుత్వం ముందు ఉంచామని మరో ట్రస్టీ నాగానంద్ వెల్లడించారు. మీడియా సమావేశానికి ట్రస్టీలు ఎస్. చక్రవర్తి, పీఎమ్. భగవతి, ఎస్వీగిరి, ఇందూలాల్ షా, శ్రీనివాసన్, నాగానంద్, రత్నాకర్ హాజరు అయ్యారు. సత్యసాయి బాబా ఆసుపత్రిలో చేరిన మొదటిరోజే శవపేటిక తయారీకి ఆర్డర్ ఇచ్చారన్న ఆరోపణలను సెంట్రల్ ట్రస్ట్ ఖండించింది. ఈ ఆరోపణలు అవాస్తవమని, ఒక భక్తుడు ఈ ఆర్డర్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని మీడియా సమావేశంలో ట్రస్టీ శ్రీనివాసన్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే నిరాధార కథనాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.సత్యసాయి బాబాకు సెంట్రల్ ట్రస్ట్ శ్రద్ధాంజలి ఘటించింది. రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించింది. ట్రస్టు భవిష్యత్ కార్యాచరణపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు మందుగా బాబాకు అంజలి ఘటించి తమను తాము పరిచయం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలు, ఆస్తుల వివరాలను వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment