Friday, March 11, 2011

ఇంగ్లాండ్ పై బంగ్లా అనూహ్య విజయం

చిట్టగాంగ్ , మార్చి 11:  ప్రపంచ కప్  మ్యాచ్'లో ఇంగ్లాండ్ జట్టుపై బంగ్లాదేశ్ జట్టు అనూహ్య  విజయం సాధించింది. 226 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు 49 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసింది.  ఇక్బాల్ 38 పరుగులు, ఇమ్రుల్ 60, సిద్ధిఖీ 12,షకీబ్ అల్ హసన్ 32, రహీమ్ 6, రజాక్ ఒక పరుగు చేశారు. రఖీబుల్ హసన్, నయీమ్ ఇస్లామ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యారు. మహ్మదుల్ల 21 పరుగులు, షఫీవుల్ ఇస్లామ్ 24 పరుగులతో నాటౌట్'గా నిలిచారు. షాజద్ మూడు వికెట్లు, జిపి శ్వాన్ రెండు వికెట్లు, టిటి బ్రెస్నన్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 225 పరుగులకు కుప్పకూలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 49.4 ఓవర్లలో ఇంగ్లాండ్ టీమ్‌ను కట్టడి చేసింది. ఇంగ్లాండ్ జట్టులో ట్రాట్ 67, మోర్గాన్ 63 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఇస్లామ్, రజాక్, హసన్ రెండేసి  వికెట్లు తీసుకున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...