Wednesday, March 30, 2011

భళా...టీమిండియా...

పాక్ పై గెలుపు..ఇక లంకతో తుది పోరు

మొహాలీ, మార్చి 30: కోట్లాదిమంది భారతీయుల ఆశలను వమ్ము చేయకుండా టీమిండియా వరల్డ్ కప్ సెమీస్ లో పాకిస్తాన్ ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్ కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 వోవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత జట్టులో అత్యధికంగా సచిన్ 85 పరుగులు సాధించగా, ఇతర ఆటగాళ్లలో సెహ్వాగ్ 38, గంభీర్ 27, ధోని 25, హర్భజన్ 12 పరుగులు చేశారు. రైనా 34, నెహ్రా 1పరుగుతో నాటౌట్‌గా మిగిలారు. పాక్ బౌలర్లలో వహబ్ రియాజ్ 5, అజ్మల్ 2, హ ఫీజ్ 1 వికెట్ పడగొట్టారు.మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 95వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ 20.2 ఓవర్‌లో ఆఫ్రీది వేసిన రెండవ బంతికి బంతికి సచిన్ బౌండరీని సాధించగానే వన్డేలో 95 అర్ధ సెంచరీ పూర్తి అయింది. ప్రపంచకప్‌లో సచిన్‌కు ఇది 15 హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్ కొట్టిన సెహ్వాగ్ పాకిస్థాన్‌పై వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 261 పరుగుల విజయలక్ష్యం తో బరిలోకి దిగిన పాక్ 49.5 ఓవర్లలో 231పరుగులకు ఆలవుట్ అయింది. మిస్బా-ఉల్-హక్ 56 (నాటౌట్) హఫీజ్ 43, షఫీక్ 30 పరుగులు మినహా ఇతర బ్యాట్స్ మెన్లెవరూ రాణించలేదు. మునాఫ్ పటేల్. యువరాజ్, హర్భజన్,నెహ్రా,జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అతిరథ మహారథుల సాక్షిగా రెండు దేశాల ప్రధానుల సమక్షంలో ఇరుదేశాల్లోనూ కలిపి 150 కోట్ల మంది ప్రేక్షకులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను తిలకించారు. ఏప్రిల్ రెండున జరిగే ఫైనల్స్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...