న్యూఢిల్లీ,మార్చి 19: యూపీఏ-1 ప్రభుత్వం 2008లో లోక్సభలో విశ్వాస తీర్మానం నెగ్గేందుకు ఎంపీలకు లంచాలిచ్చిందన్న వికీలీక్స్ కథనాలు పూర్తిగా నిరాథారమని ప్రధాని మన్మోహన్సింగ్ స్పష్టం చేశారు. వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు పార్లమెంటు ఉభయ సభల్లోనూ శుక్రవారం ప్రకటన చేశారు. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వాషింగ్టన్కు పంపిందంటున్న దౌత్య పత్రాల్లోని వివరాలను గానీ, నిజానిజాలను గానీ, అసలు వాటి ఉనికిని గానీ నిర్ధారించలేమన్నారు. బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్ నుంచి, యూపీఏ ప్రభుత్వం తరఫున ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు. గతంలోనే విచారణ జరిపి తిరస్కరించిన ఉదంతంపై వచ్చిన.. రుజువు చేయలేని వార్తలను పట్టుకుని ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధాని ప్రకటనను విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ఆయన వివరణకు సభ్యులు పట్టుబట్టారు. అందుకు సభాధ్యక్షులు అనుమతించకపోవడం వివాదానికి దారి తీసింది. విపక్షాల ఆందోళనతో లోక్సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి!
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment