వికీలీక్స్ కథనాలు నిరాథారం: ప్రధాని

న్యూఢిల్లీ,మార్చి 19:  యూపీఏ-1 ప్రభుత్వం 2008లో లోక్‌సభలో విశ్వాస తీర్మానం నెగ్గేందుకు ఎంపీలకు లంచాలిచ్చిందన్న వికీలీక్స్ కథనాలు పూర్తిగా నిరాథారమని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు.  వాటిని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు పార్లమెంటు ఉభయ సభల్లోనూ శుక్రవారం ప్రకటన చేశారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వాషింగ్టన్‌కు పంపిందంటున్న దౌత్య పత్రాల్లోని వివరాలను గానీ, నిజానిజాలను గానీ, అసలు వాటి ఉనికిని గానీ నిర్ధారించలేమన్నారు. బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్ నుంచి, యూపీఏ ప్రభుత్వం తరఫున ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు. గతంలోనే విచారణ జరిపి తిరస్కరించిన ఉదంతంపై వచ్చిన.. రుజువు చేయలేని వార్తలను పట్టుకుని ప్రతిపక్షాలు  లేనిపోని రాద్ధాంతం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధాని ప్రకటనను విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ఆయన వివరణకు సభ్యులు పట్టుబట్టారు. అందుకు సభాధ్యక్షులు అనుమతించకపోవడం వివాదానికి దారి తీసింది. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి!

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు