Thursday, March 17, 2011

విదేశాలకూ ఇక ‘మనియార్డర్ ’

హైదరాబాద్, మార్చి 18:  విదేశాల్లోని ఆప్తులకు సులభంగా డబ్బు పంపేందుకు ‘మనియార్డర్ విదేశ్’ పేరుతో తపాలాశాఖ సరికొత్త పథకాన్ని అవుల్లోకి తెచ్చింది. దీని ద్వారా దేశంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసుల నుంచి విదేశాల్లో ఉన్న వారికి తేలిగ్గా డబ్బు పంపవచ్చు. నాలుగు రోజుల్లో వారికి సొమ్ము  చేరుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్’ ద్వారా విదేశాల నుంచి భారత్‌కు డబ్బు పంపే సదుపాయుం ఉంది. అయితే,  ఇక్కడినుంచి విదేశాలకు సొమ్ము పంపే అవకాశం లేదు. ఈ ఇబ్బందులను నివారించేందుకు పోస్టల్‌శాఖ ‘మనియూర్డర్ విదేశ్’ పథకాన్ని రూపొందించింది. దీని ద్వారా డబ్బు పంపేవారు పోస్టాఫీసుల్లో తవు చిరునామా ధ్రువపత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. మనియార్డర్ చేసే సొమ్ము విలువను యూఎస్ డాలర్లలో లెక్కిస్తారు.సాధారణ అవసరాల నిమిత్తం ఈ పథకం ద్వారా 100 నుంచి 500 యూఎస్ డాలర్లు (రూ. 5000 -రూ. 2,50,000 ) వరకు పంపే వీలుంది.  విదే శాల్లో ఖరీదైన విద్య, వైద్యం కోసమైతే లక్ష యూఎస్ డాలర్లు(రూ. 50 లక్షల వరకు) పంపే వెసులుబాటు కల్పించారు.విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినవారికి 10,000 యూఎస్ డాలర్ల వరకు (రూ. 5 లక్షలు) పంపవచ్చు.విదేశాలకు 100 నుంచి 1000 యూఎస్ డాలర్ల వరకు పంపే వారి నుంచి తపాలాశాఖ సేవల కింద 12 డాలర్లు వసూలు చేస్తారు.1000 నుంచి 3000 యూఎస్ డాలర్ల వరకు పంపిస్తే 20 యూఎస్ డాలర్లు కమిషన్ చెల్లించాలి.3000 నుంచి 5000 డాలర్ల వరకూ 25 డాలర్లను కమిషన్ చార్జ్ కింద వసూ లు చేస్తారు.విదేశాల నుంచి డబ్బును భారత్‌లో ఉన్న వారికి కూడా పంపవచ్చు. అయితే ఒకసారి 500 యూఎస్ డాలర్ల వరకు మాత్రమే పంపాలి. ఇలా ఒక ఏడాదిలో 12 సార్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.విదేశాల నుంచి పంపిన డబ్బును రూ. 2.5 లక్షల వరకు నగదు రూపంలోనే అందిస్తారు. డబ్బు విలువ అంతకు మించి ఎక్కువగా ఉంటే చెక్ రూపంలో ఇస్తారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...