Wednesday, March 30, 2011

అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహూజాకి ఏడేళ్ల జైలు

ముంబై, మార్చి 30: పనిమనిషిపై అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహూజాకి ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కేసుపై కోర్టు రహస్య విచారణ జరిపింది. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన అహుజాను పోలీసులు 2009 జూన్‌లో అరెస్టు చేశారు. అహుజాకు 2009 నవంబర్‌లో బొంబాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. కాగా, తన భర్త అమాయకుడని అహుజా భార్య వాదిస్తూ వస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చినా అహుజాకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అతనితో నటించడానికి చాలా మంది తారలు నిరాకరిస్తూ వచ్చారు. తీర్పు విన్నాక షైనీ కంట నీరు పెట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...