అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహూజాకి ఏడేళ్ల జైలు

ముంబై, మార్చి 30: పనిమనిషిపై అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహూజాకి ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కేసుపై కోర్టు రహస్య విచారణ జరిపింది. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన అహుజాను పోలీసులు 2009 జూన్‌లో అరెస్టు చేశారు. అహుజాకు 2009 నవంబర్‌లో బొంబాయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. కాగా, తన భర్త అమాయకుడని అహుజా భార్య వాదిస్తూ వస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చినా అహుజాకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. అతనితో నటించడానికి చాలా మంది తారలు నిరాకరిస్తూ వచ్చారు. తీర్పు విన్నాక షైనీ కంట నీరు పెట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.



Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు