Saturday, March 5, 2011

కౌన్సిల్ ఎన్నికలు: ఏడో సీటుపై ఎటూ తేల్చని కాంగ్రెస్

హైదరాబాద్,, మార్చి 6:   ఎమ్మెల్యే నియోజకవర్గాల శాసనమండలి స్థానాల ఎన్నికల్లో ఆరింటికి పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ కూటమి ఏడో స్థానంపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రజారాజ్యం పార్టీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లను కలుపుకొని ఆరు స్థానాలు గెలవనున్న కాంగ్రెస్.. నాలుగు స్థానాలకు తన అభ్యర్థులను ఖరారు చేసింది. శాసనమండలి ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ మహ్మద్ జానీ, సభ్యులు పాలడుగు వెంకట్రావు, బి.చెంగల్రాయుడులతో పాటు కొత్తగా కర్నూలు మాజీ మున్సిపల్ చైర్మన్, డీసీసీ ప్రధాన కార్యదర్శిసుధాకర్‌బాబును ఎంపిక చేస్తూ ఢిల్లీలో జాబితా విడుదల చేశారు. ఇక.. కాంగ్రెస్‌లో విలీనమవుతున్న ప్రజారాజ్యం పార్టీకి ఒక స్థానాన్ని, ఎంఐఎంకు మరో స్థానాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.   ఎమ్మెల్యే కోటా స్థానాలు పదింటికి ఎన్నికలు జరగనుండగా ఒక్కో అభ్యర్థి గెలవాలంటే 27 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్య ఓటు వేయాల్సి ఉంటుంది. శాసనసభలో కాంగ్రెస్, పీఆర్పీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ల సంఖ్యను అనుసరించి ఆ కూటమికి ఆరు స్థానాలు కచ్చితంగా దక్కుతాయి. ఏడో స్థానానికి అభ్యర్థిని నిలిపినా గెలుపు కచ్చితమని లేదు. దీంతో ఏడో అభ్యర్థిని బరిలో దింపాలా వద్దా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. పార్టీకి ఆరు స్థానాల్లో గెలుపునకు సరిపడా ఓట్లతోపాటు అదనంగా మరికొన్ని ఓట్లు ఉండటంతో.. రెండో ప్రాధాన్య ఓటు లెక్కిం పు తో అయినా ఏడో అభ్యర్థి గట్టెక్కే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఏడో అభ్యర్థిని దింపడం పై నిర్ణయం తీసుకోవలసి వుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...