ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్

హైదరాబాద్, మార్చి 18: చివరి నిమిషం వరకు ఉత్కంఠ కలిగించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ నుంచి ఒకరు, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఒకరు పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యే కోటాలో పది ఎమ్మెల్సీ స్థానాల కోసం గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. సాయంత్రం అయిదు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. తొలి ప్రాధాన్యతా ఓట్లతో అయిదుగురు అభ్యర్థులు విజయం సాధించగా, మిగిలిన అభ్యర్థులకు రెండు నుంచి వరుసగా అయిదో ప్రాధాన్యతాఓట్ల వరకు లెక్కించాల్సిన పరిస్థితి తలెత్తింది. అర్ధరాత్రి వరకు జరిగిన లెక్కింపులో చివరకు కాంగ్రెస్ 5, దాని మిత్రపక్షాలైన పీఆర్పీ, ఎంఐఎం ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక టీడీపీ ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దింపగా ఒకరు ఓడిపోయారు. దాని మిత్రపక్షం సీపీఐ అభ్యర్థి టీడీపీ మద్దతుతో గెలుచుకోగలిగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి కేవ లం 11 ఓట్లతో చివరి స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యారు. పోలైన 293 ఓట్లకుగాను రెండు ఓట్లు చెల్లలేదు. ఒకటి ఎవరికీ పడలేదు.  ప్రాధాన్యతలను ఇవ్వడంలో దాదాపు అన్ని బ్యాలెట్లలోనూ క్రాస్ ఓటింగ్ కనిపించింది. మొత్తం 10 స్థానాలకు గాను 12 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు