Tuesday, March 15, 2011

బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ అవకాశాలు సజీవం

చిట్టగాంగ్,మార్చి 15: బంగ్లాదేశ్  ప్రపంచకప్‌లో తమ క్వార్టర్ ఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. నెదర్లాండ్స్ తో సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 46.2 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో నలుగురు రనౌట్ కావడం విశేషం. 161 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ ఇమ్రుల్ కైస్ (113 బంతుల్లో 6 ఫోర్లతో 73 నాటౌట్) రెండు అర్ధసెంచరీ భాగస్వామ్యాలలో పాలుపంచుకున్నాడు. బంగ్లాదేశ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించడంతోపాటు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
క్వార్టర్ ఫైనల్‌కు చేరిన పాక్
   వరల్డ్ కప్ గ్రూప్ ‘ఎ’ లో  పాకిస్థాన్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.  జింబాబ్వేతో జరిగిన డే అండ్ నైట్ వన్డేలో పాక్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆఫ్రిది సేన ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఎనిమిది పాయింట్లు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే  39.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 151 పరుగులు చేసింది. పలు మార్లు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడంతో మ్యాచ్‌ను కుదించి పాక్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 38 ఓవర్లలో 162 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. ఓపెనర్ మహ్మద్ హఫీజ్ (65 బంతుల్లో 49; ఫోర్లు 4) శుభారంభాన్ని ఇవ్వగా షఫీఖ్ (97 బంతుల్లో 78 నాటౌట్; ఫోర్లు 7)  చివరిదాకా  క్రీజులో నిలిచి పాక్‌కు విజయాన్ని అందించాడు. 34.1 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన పాక్ 164 పరుగులు సాధించింది. 1999 ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత పాక్ జట్టు ఛేజింగ్‌లో గెలవడం ఇదే తొలిసారి.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...