కివీస్ పై లంక గెలుపు

మురళీధరన్ (4/25)
ముంబై,మార్చి 19:    క్వార్టర్ ఫైనల్ స్థానం ముందే ఖరారు అయినప్పటికీ న్యూజిలాండ్‌తో జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌ను శ్రీలంక తేలిగ్గా తీసుకోలేదు.  112 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని ఖాయం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 265 పరుగులు సాధించింది. కెప్టెన్ కుమార సంగక్కర (128 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 111) ఈ టోర్నీలో తొలి సెంచరీ చేయగా... మహేల జయవర్ధనే (90 బంతుల్లో 6 ఫోర్లతో 66)... ఏంజెలో మాథ్యూస్ (35 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) రాణించారు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. మేటి స్పిన్నర్ మురళీధరన్ (4/25) న్యూజిలాండ్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. ఇతర స్పిన్నర్లు అజంత మెండిస్ రెండు వికెట్లు, దిల్షాన్ ఒక వికెట్ తీసుకున్నారు. పేస్ బౌలర్లు కులశేఖర, మాథ్యూస్, మలింగలకు ఒక్కో వికెట్ దక్కింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు