హైదరాబాద్, మార్చి 15: తన భర్త శిరీష్ భరద్వాజ్ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారంటూ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సీసీఎస్ మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శిరీష్తో పాటు ఆయన తల్లిపై పోలీసులు వరకట్న వేధింపులు, డౌరీ ప్రొహిబిషన్ యాచ్ట్ ల కింద కేసు నమోదు చేశారు. వివాహమైన ఏడాదికే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని, అయితే తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకున్నందున బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిన్నకుండిపోయానని శ్రీజ తన ఫిర్యాదులో వివరించారు. ‘‘వ్యాపారం చేయడానికి పుట్టింటి నుంచి రూ. 50 లక్షలు తీసుకురావాల్సిందిగా వారం రోజుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ బాధలు తాళలేక డబ్బు తీసుకువస్తానని చెప్పి ఆ ఇంటి నుంచి వచ్చేశాను. ఇక తిరిగి వెళ్లను. వేధింపులకు పాల్పడిన భర్త, అత్తలపై చర్యలు తీసుకోండి’’ అని తన ఫిర్యాదులో శ్రీజ పేర్కొన్నారు. వివాహమైన నాటి నుంచి శిరీష్ ఎలాంటి వ్యాపకం లేకుండా తిరుగుతూ, తాను ఏదో తెస్తానని ఆశిస్తున్నారని వివరించారు. దీంతో అభద్రతాభావానికి లోనైన తాను.. తన పేరిట ఉన్న ఆస్తులను పుట్టింటి వారి పేరిట రీ-రిజిస్టర్ చేసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ పరిణామం తరవాత తనకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, భర్త ఆగడాలకు అత్త వంత పాడేదని శ్రీజ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2007 అక్టోబర్ 17న న్యూ బోయిన్పల్లిలోని ఆర్యసమాజ్లో శిరీష్-శ్రీజలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment