పాక్ ను పడగొట్టిన కివీస్
క్యాండీ (శ్రీలంక),మార్చి 9: :మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 110 పరుగుల ఆధిక్యంతో పాక్ పై ఘనవిజయం సాధించింది. ఈ ప్రపంచకప్లో పాకిస్థాన్కిదే తొలి పరాజయం. రాస్ టేలర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 302 పరుగుల స్కోరు చేసింది. అనంతరం పాకిస్థాన్ 41.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. కివీస్ ‘బర్థ్ డే బర్త్డే బాయ్’ రాస్ టేలర్ (124 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 131 నాటౌట్) తుఫాన్ సృష్టించాడు. ఆఖరి ఆరు ఓవర్లలో రాస్ టేలర్, నాథన్ మెక్కల్లమ్, జాకబ్ ఓరమ్ వీరవిహారంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 302 పరుగుల స్కోరు చేసింది.
Comments