Tuesday, March 15, 2011

ఫుకుషిమా లో పేలిన నాలుగో రియాక్టర్

టోక్యో,మార్చి 15:   ఫుకుషిమా లో నాలుగో రియాక్టర్ పేలింది. అంతకు ముందు రియాక్టర్‌లో పనిచేసే ఉద్యోగులను ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రియాక్టర్‌లో పేలుడు సంభవించటంతో రేడియేషన్ లీకయ్యే ప్రమాదం ఉందని జపాన్ ప్రధాని తెలిపారు. కాగా క్యోడాలో సాధారణం కంటే 9 రెట్లు ఎక్కువగా రేడియేషన్ ఉన్నట్లు శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఇలావుండగా, జపాన్ తీరప్రాంతంలో శ్మశాన వాతావరణం రాజ్యమేలుతోంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగని భారీ భూకంపం, దాని ఫలితంగా వచ్చిన సునామీ ధాటికి విలవిల్లాడిన ప్రాంతాల్లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క మియాగీ రాష్ట్రంలోనే సోమవారం రెండువేల మంది మృతదేహాలు బయటపడ్డాయి. సునామీ కబళించిన ఊళ్లలో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే..! 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...