మిర్పూర్ ,మార్చి 23 : పాకిస్థాన్ వరుసగా ఐదోసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారమిక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని పాక్ 20.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అక్మాల్ 47, హఫీజ్ 61 పరుగులతో నాటౌట్గా నిలిచారు. సెమీస్లో భారత్ లేదా ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ ఓటమితో వెస్టిండీస్ ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 112 పరుగులకు ఆలౌటయింది. వెస్టిండీస్పై విజయం సాధించి సెమీఫైనల్ చేరుకోవడంతో పాకిస్థాన్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రపంచకప్లో సాధించిన విజయానికి మాజీ అధ్యక్షులు ముష్రాఫ్ జట్టుకు అభినందనలు తెలిపారు. జాతి గర్వపడే విజయాన్ని సాధించారని ముఫ్రాఫ్ అభినందనలు కురిపించారు. పాకిస్థాన్ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి ప్రపంచకప్ను గెలువాల్సిన అవసరముందని మాజీ కెప్టెన్, పాక్ రాజకీయవేత్త ఇమ్రాన్ఖాన్ అన్నారు. తమ జట్టు ప్రపంచకప్ను గెలుస్తుందన్న ఆశాభావాన్ని ఇమ్రాన్ వ్యక్తం చేశారు. వృద్ధులు, కుటుంబాలు, యువతి, యువకులు రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేశారు. వెస్టిండీస్పై విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే ఆకాశంలో టపాసులు పేల్చి ఆనందంతో ఆడిపాడారు. గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్థాన్ క్రికెట్ వివాదస్పదమౌతుండటంతో నిరాశకు లోనైన అభిమానులు ఈ విజయంతో ఊరట చెందారు. యువకులు వీధుల్లోకి వచ్చి టీషర్టులను గాలిలో ఊపుతూ బాంగ్రా నృత్యానికి అనుగుణంగా స్టెప్పులు వేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment