కైరో,, మార్చి 6: లిబియాలో గడాఫీ అనుకూల, వ్యతిరేక దళాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ప్రధానంగా రాస్ లునాఫ్, అల్ జావియా పట్టణాల్లో భీకరపోరు కొనసాగుతోంది. రాజధాని ట్రిపోలీకి దగ్గరలో ఉన్న అల్జావియా పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం గడాఫీ సేన శనివారం మూడుసార్లు ప్రయత్నించిందని, గడాఫీ మద్దతుదారుల దాడుల్లో అల్జావియాలో 30 మంది చనిపోయినట్లు చానళ్ళు తెలిపాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణల్లో దేశవ్యాప్తంగా శనివారం ఒక్కనాడే దాదాపు 74 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బెంఘాజీ శివార్లలో గడాఫీ సైన్యం జరిపిన వైమానిక దాడులలో సైన్యానికి చెందిన ఆయుధ గిడ్డంగి వద్ద దాదాపు 34 మంది చనిపోయారు. తిరుగుబాటుదారులు నియంత్రణలోకి తీసుకున్న ప్రాంతాలపై తిరిగి పట్టు సాధించడం కోసం గడాఫీ సైన్యం యుద్ధట్యాంకులు, అత్యాధునిక ఆయుధాలతో దాడులను ఉధృతం చేసింది. తిరుగుబాటుదారుల స్థావరాలపై విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తోంది. గడాఫీ ప్రభుత్వాన్ని గుర్తించడం లేదంటూ అమెరికా సహా పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో.. సమాంతర ప్రభుత్వ ఏర్పాటుకు తిరుగుబాటుదారులు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment