ముంబై చేరుకున్న థోనీ సేన

ముంబై,మార్చి 31 :  ‘హై ఓల్జేజ్’ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయోత్సాహంతో  భారత క్రికెట్ జట్టు ముంబై నగరానికి చేరుకుంది. మొహాలీ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్ విమానంలో భారత జట్టు ముంబై బయలుదేరగా, పరాజయ భారంతో పాకిస్థాన్ జట్టు లాహోర్‌కు ప్రయాణమైంది. శనివారం   జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో భారత్ తలపడనుంది. భారత జట్టు బస చేయనున్న హోటల్ బయట అభిమానులు పెద్ద ఎత్తున చేరారు.  కాగా, చేతి వేలి గాయంతో భారత బౌలర్ ఆశిష్ నెహ్రా  శ్రీలంకతో జరగనున్న  ఫైనల్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో గురువారం జరిగిన సెమీస్‌లో నెహ్రా చేతి వేలికి గాయమయింది.
ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్రపతులు...
ప్రపంచకప్  ఫైనల్ మ్యాచ్‌ను భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్, శ్రీలంక అధ్యక్షులు మహేంద్ర రాజపక్స వీక్షించనున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు కొలంబో నుంచి రాజపక్స, న్యూఢిల్లీ నుంచి పాటిల్ ముంబైకు చేరుకుంటారని రాష్టప్రతి భవన్ అధికారులు ధృవీకరించారు. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న ముత్తయ్య మురళీధరన్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమంలో రాజపక్స పాల్గొంటారని శ్రీలంక ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు