ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్,మార్చి 29: : శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శాసనసభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం రాత్రి రాత్రి 8 గంటల సమయంలో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. చివరి రోజున సభలో ప్రభుత్వ భూమి కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చజరిగింది.హైదరాబాద్: భూ కేటాయింపులపై సభాసంఘం వేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. ప్రభుత్వం వివిధ సంస్థలకు భూములు కేటాయించడంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఎంఐఎం సభ్యునితోపాటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. భూ కేటాయింపులపై సభాసంఘం వేయాలని కోరారు. ఒక పరిమితికిలోబడి భూముల కేటాయింపులపై సభాసంఘం వేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే విపక్షాల నిరసన మధ్య శాసనసభ అరగంటపాటు వాయిదా పడింది. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో మంత్రి గీతారెడ్డి, ఉప సభపతి వారించినా ఫలితం లేకపోయింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని కోరినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీని అరగంటపాటు వాయిదా వేశారు.ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం సభలో భూకేటాయింపులపై చర్చ ప్రారంభం అయ్యింది. కాగా హసన్ అలీ లింకులపై చర్చించాలంటూ వైఎస్ జగన్ వర్గ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. హసన్ అలీ పేర్కొన్న ఆ నేత పేరు బయటపెట్టాలని వారు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దాంతో డిప్యూటీ స్పీకర్ దీనిపై చర్చించేందుకు అవకాశం ఇస్తామని, సభ జరిగేందుకు సహకరించాలని ఎమ్మెల్యేలను కోరారు.
Comments