Sunday, March 6, 2011

పెరగనున్న ఐటి ఉద్యోగుల వేతనాలు

హైదరాబాద్, మార్చి 7: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, బీమా రంగం, ఇతర కార్పోరేట్ రంగాల్లో ఉద్యోగుల వేతనాలు ఈ ఏడాది బాగా పెరిగే అవకాశాలున్నాయి. రెండేళ్ల పాటు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని విలవిలలాడిన ఐటి ఉద్యోగులకు  ఈ ఏడాది 16 శాతం వరకు వేతనాలు పెరుగుతాయని హ్యూమన్ రిసోర్స్ కన్సల్టింగ్ సంస్ధ మెర్సర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇంక్రిమెంట్లు గత ఏడాది కంటే ఎక్కువగానే ఉంటాయి. అనేక బెనిఫిట్లను ఉద్యోగులకు కార్పోరేట్ కంపెనీలు ఇవ్వనున్నాయని,   కొన్ని కంపెనీలు 13 నుంచి 14 శాతం వరకు ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వెనకాడవని హ్యూమన్ రిసోర్స్ సంస్ధ పేర్కొంది.  ప్రథానంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్, చమురు, సహజవాయువు, మైనింగ్ షిప్పింగ్, ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో, ఐటి, ఎఫ్‌ఎంజిసి, ఇతర వినిమయ వస్తువుల తయారీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...