Sunday, March 20, 2011

సంపద తగ్గినా నెంబర్ వన్ ' లక్ష్మీ ' మిట్టలే... !

లండన్ ,మార్చి 20:  భారత సంతతికి చెందిన అపర కుబేరుడు, ఉక్కు దిగ్గజం లక్ష్మిమిట్టల్ బ్రిటన్  లోని ఆసియన్ సంపన్నుల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని అధిష్టించారు. ఎసియన్ మీడియా, మార్కెటింగ్ గ్రూప్‌కు చెందిన ఈస్టర్న్ ఐ వీక్లీ మ్యాగజైన్ రూపొందించిన ఈ జాబితాలో 15.5 బిలియన్ పౌండ్లతో లక్ష్మి మిట్టల్ మొదటి స్థానంలో నిలిచారు.అయితే ఆయన సంపద ఏడాదిలో 1.5 బిలియన్లు పౌండ్లు తగ్గిందని వీక్లీ పేర్కొంది. కాగా విస్తృతమైన వ్యాపారాలున్న హిందూజ సోదరులు-శ్రీచంద్, గోపి, ప్రకాశ్, అశోక్‌లు 9బిలియన్ పౌండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. వీరి సంపద ఏడాదిలో 1 బిలియన్ పౌండ్లు వృద్ధి సాధించింది. 90 మిలియన్ల పౌండ్ల వృద్ధితో 600 మిలియన్ల పౌండ్ల సంపద కలిగిన ప్రముఖ పారిశ్రామిక వేత్త లార్డ్ స్వరాజ్ పాల్ జాబితాలో ఆరోవ స్థానం సాధించారు. వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్ (500 మిలియన్ పౌండ్ల వృద్ధితో 4.5 బిలియన్ పౌండ్లు) మూడవ స్థానంలో, జెట్ ఎయిర్‌వేస్ అధిపతి నరేష్ గోయల్(68 మిలియన్ పౌండ్ల వృద్ధితో 425 మిలియన్ పౌండ్లు) జాబితాలో పదవ స్థానంలో నిలిచారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...