అసీస్ ను కొట్టాం...ఇక పాక్ తో ఢీ...

అహ్మదాబాద్,మార్చి 24: : అసీస్ తో క్వార్టర్ ఫైనల్స్ కష్టమే అన్న భయాలను చెదరగొట్టి కోట్లాది మంది భారతీయుల కొండంత నమ్మకాన్ని నిలబెట్టి.. 2003 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురయిన పరాభవానికి ప్రతీకారాన్ని తీర్చుకొని.. ఏ ఒక్కరిపై ఆధారపడకుండా, సమిష్టిగా రాణించి టీమిండియా డ్రీమ్‌కప్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సర్వశక్తులు ఒడ్డి... వరసగా విశ్వవిజేతగా నిలుస్తున్న అసీస్ ను ఆదరగొట్టి  ఇంటిముఖం పట్టించింది. అసాధారణ మ్యాచ్‌లో అద్వితీయ ప్రతిభతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. అసీస్ తన ముందుంచిన 161 పరుగుల విజయ లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టంతో చేదించింది. సచిన్, గంభిర్ ల  అర్థ సెంచరీలకు యువరాజు అజేయ అర్థ సెంచరీ,  రైనా దూకుడు షాట్లు కలసి భారత్ కు  అపూర్వ  విజయాన్ని అందించాయి.  ఇక సెమిస్‌లో చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్తాన్ ను ఢీ కొనబొతోంది.   కాగా, భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన క్రీడాజీవితంలో మరో మైలు రాయిని అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 18 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో  క్వార్టర్ ఫైనల్లో మాస్టర్ ఈ ఫీట్ పూర్తి చేశాడు. వక్తిగత స్కోరు 45 పరుగుల వద్ద అతడీ రికార్డు సృష్టించాడు. 451 వన్డే ఆడుతున్న సచిన్ ఆసీస్ బౌలర్ బ్రెట్‌లీ వేసిన 14వ ఓవర్‌లో సింగిల్ తీయడం ద్వారా 18 వేలు పరుగులు పూర్తి చేయగానే మొతేరాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మైదానం చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. 


Comments

Unknown said…
అసీస్ తన ముందుంచిన 161 పరుగుల విజయ లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టంతో చేదించింది.

Uncle meeru 261 ki badulu 161 ani rasaru, looks like a spelling mistake :).

Sridhar

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు