Friday, March 4, 2011

తమిళనాట ఇక ' జయ 'ప్రదం?

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 5: త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సారధ్యంలోని అన్నాడీఎంకే కూటమికే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమికన్నా అన్నాడీఎంకే కూటమికే ఎక్కువగా లాభం చేకూరనుందని ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ ‘ఔట్‌లుక్’, ఎండీఆర్‌ఏ సంస్థ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో తేలింది. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచ్చిలలో ఫిబ్రవరి 26-28 మధ్య 626 మందితో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది ప్రజలు తాము అన్నాడీఎంకే కూటమికి అధికారం కట్టబెడతామని పేర్కొనగా కేవలం 34 శాతం మంది ప్రజలు మాత్రమే డీఎంకే వైపు మొగ్గు చూపారు. కాగా, 2జీ స్పెక్రమ్ కుంభకోణంతో తమిళనాడు ప్రతిష్ట దెబ్బతిన్నదని 86.1 శాతం మంది అభిప్రాయపడగా అవినీతి ఆరోపణలు, ధరల పెరుగుదల అంశాలు ఎన్నికల్లో డీఎంకే కూటమిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వరుసగా 71.9, 72.5 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2జీ కుంభకోణం... ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబం, డీఎంకేను దెబ్బతీసిందని 78.1 మంది పేర్కొనగా ఈ స్కాం వల్ల కరుణ కుటుంబం లబ్ధి పొందిందని 73 శాతం మంది విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
జయతో చేతులు కలపిన విజయకాంత్    
ఇలా వుందగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని ప్రముఖ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, అన్నాడీఎంకే నిర్ణయించాయి. డీఎండీకేకి 41 నియోజకవర్గాలను కేటాయించేందుకు జయలలిత అంగీకరించారు. ఈ మేరకు ఇరు పార్టీలు మీడియాకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించిన తరువాత విజయకాంత్ జయలలితను కలుసుకోవడం ఇదే తొలిసారి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...