హైదరాబాద్,మార్చి 20: దళితులు, గిరిజనుల సవుస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్న రాఘవులు, పార్టీ నేతలు మిడియుం బాబూరావు, ఎస్.వీరయ్యు, జి.నాగయ్య లను శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే, రాఘవులు ఆస్పత్రిలో చికిత్సను నిరాకరించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు దీక్ష ఉపసంహరించేది లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. రాఘవులు అరెస్టు వార్త తెలియడంతో సీపీఎంతోపాటు పార్టీ అనుబంధ ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి వచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment