న్యూఢిల్లీ,మార్చి 21: ఏప్రిల్ మూడో వారంలో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ విలీన సభ నిర్వహించనున్నట్లు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. తమిళనాడులో ఎన్నికల తరువాత విలీన సభ నిర్వహించడం మంచిదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్'ఛార్జి గులామ్'నబీ అజాద్ సూచన చేసినట్లు ఆయన తెలిపారు. విలీన సభకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉందన్నారు.ఏప్రిల్ 11వ తేదీలోపల తాను తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చిరంజీవి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచనల మేరకే తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేశారని ఆయన చెప్పారు. తమిళనాడులో ప్రతి ఒక్కరికీ తాను తెలుసని చెప్పారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తనను పంపించే అవకాశాలు ఉన్నాయన్నారు. అంతటా ప్రచారం చేయమన్నా తాను సిద్ధమని చెప్పారు. తమిళనాడులో కాంగ్రెసు నేతగా ప్రచారం చేస్తానని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment