కొలంబో,మార్చి 29: ప్రపంచకప్ టైటిల్ పోరుకు శ్రీలంక సిద్ధమయింది. మంగళవారమిక్కడ జరిగిన సెమీస్లో న్యూజిలాండ్పై నెగ్గి లంక ఫైనల్లో ప్రవేశించింది. బుధవారం, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్లో విజేతగా నిలిచిన జట్టుతో లంక ఫైనల్లో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 2న జరుగుతుంది. వరుసగా రెండోసారి, ఇప్పటివరకు మూడుసార్లు శ్రీలంక ఫైనల్లోకి ప్రవేశించింది. కివీస్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దిల్షాన్(73), సంగక్కర(54) అర్థ సెంచరీలతో రాణించారు. తరంగ 30, చమరసిల్వా 13, సమరవీర 23, మాథ్యూస్ 14 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌతీ 3 వికెట్లు పడగొట్టాడు. వెటోరి, మెకే చెరో వికెట్ తీశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 48.5 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటయింది. కివీస్ వరల్డ్ కప్ సెమీస్ వరకు వచ్చి వెనుదిరగడం ఇది ఆరోసారి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment